Abhishek Banerjee | కోల్కతా: కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ బకాయిలపై తృణమూల్ కాంగ్రెస్ ఢిల్లీలో నిరసన చేపట్టనున్న రోజే ఈడీ తనను విచారణకు పిలవడంపై తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీ స్పందించారు. ‘బెంగాల్ ప్రజల హక్కుల కోసం పోరాటంలో ఏ శక్తీ నన్ను అడ్డుకోలేదు. అక్టోబర్ 2,3న ఢిల్లీలో జరిగే నిరసనల్లో పాల్గొంటా.
చేతనైతే అడ్డుకోండి’ అని ఎక్స్లో ఆయన పేర్కొన్నారు. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల కేసులో వచ్చే నెల 3న తమ ఎదుట విచారణకు రావాలని అభిషేక్కు ఈడీ సమన్లు జారీచేసింది.