చండీఘఢ్ : ఆప్ కార్యకర్త గుర్ప్రీత్ సింగ్ గోపిని పంజాబ్లోని తరన్ తరన్లో సాయుత దుండగులు శుక్రవారం కాల్చి చంపారు. ఈ ఘటన గొండ్వాల్ సాహిబ్ రైల్వే క్రాసింగ్ వద్ద జరిగిందని పోలీసులు వెల్లడించారు. ఘటన నేపధ్యంలో సింగ్ ఉన్న కారు చుట్టూ పోలీస్ అధికారులు, స్ధానికులు గుమికూడిన దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో కనిపించాయి.
గుర్ప్రీత్ సింగ్ అలియాస్ గోపి చోహ్లా ఓ కోర్టు వ్యవహారానికి సంబంధించి కపుర్తలా జిల్లాకు తన కారులో వెళుతుండగా దుండగలు ఆయనను కాల్చిచంపారు. గుర్ప్రీత్ సింగ్ వాహనాన్ని అడ్డుకున్న దుండగులు ఆయనపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఘటనా స్ధలం నుంచి పరారయ్యారు.
ఘటనకు సంబంధించి సమాచారం అందుకోగానే పోలీసులు ఘటనా స్ధలానికి చేరుకున్నారు. దుండగులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.
Read More :
Mahesh Babu | ఆసక్తికరంగా మహేశ్ బాబు నయా డెసిషన్.. అభిమానుల్లో జోష్