న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్లోని స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే విజయం సాధించామని ఆమ్ ఆద్మీ పార్టీ నేత సౌరభ్ భరద్వాజ్ ప్రకటించారు. ఆరుగురు స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎంపిక కోసం జరిగిన ఈ ఎన్నికల్లో తమ పార్టీకి మొత్తం 138 ఓట్లు వచ్చాయని చెప్పారు. బీజేపీకి చెందిన కౌన్సిలర్లు క్రాస్ ఓటింగ్ చేశారని, ఆ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యులు ఆప్ అభ్యర్థులకు ఓటేశారని ఆయన తెలిపారు.
ఎంసీడీ ఎన్నికల్లో ఆప్ 134 స్థానాలు గెలిచింది. అయితే ఇవాళ ఒక ఆప్ సభ్యుడు బీజేపీలో చేరాడు. దాంతో ఆప్ బలం 133కు తగ్గింది. అయినా ఆ పార్టీకి 138 మంది సభ్యుల ఓట్లు పడటంతో బీజేపీ సభ్యులు క్రాస్ ఓటింగ్ చేసినట్లు స్పష్టమవుతోంది. అయితే స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో తామే గెలిచామని ఆప్ ప్రకటించినా.. బీజేపీ మాత్రం అందుకు ఒప్పుకోవడం లేదు.
ఎన్నికల అధికారులు మొత్తం ఆరుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీకి ముగ్గురు ఆప్ సభ్యులు, ముగ్గురు బీజేపీ సభ్యులు ఎన్నికయ్యారని తెలిపిందని.. ఆప్ తామే గెలిచినట్లు తప్పుడు ప్రకటన చేసిందని బీజేపీ విమర్శిస్తున్నది. ఈ నేపథ్యంలో వాస్తవానికి స్టాండింగ్ కమిటీ గెలుపు ఎవరిదనే విషయంలో ఇప్పటికీ స్పష్టత కొరవడింది.
ఇవి కూడా చదవండి..