పెద్దపల్లి : హైదరాబాద్ నుండి కర్ణాటకలోని రాయచూర్కు ఆక్సిజన్ ట్యాంకర్స్ను తీసుకువెళ్తున్న రైలు పెద్దపల్లి రైల్వేస్టేషన్ సమీపంలోని చికురాయ్ వద్ద అగ్నిప్రమాదానికి గురైంది. ఆక్సిజన్ రైలు చికురాయ్ చేరుకోవడంతో ట్యాంకర్లలో ఒకదానిలో మంటలు చెలరేగాయి. 38 నంబర్ రైల్వే గేట్ వద్ద రైలును ఆపి రైల్వే అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని ఎగసిపడుతున్న మంటలను నియంత్రించారు. ట్యాంకర్ పైభాగంలో లైవ్ ఎలక్ట్రిక్ వైర్ ఉండటంతో అధికారులు ఆందోళన చెందారు. అయినప్పటికీ అగ్నిమాపక సేవా సిబ్బంది మంటలను నియంత్రించగలిగారు. అగ్నిప్రమాదానికి గల కారణం తెలియనప్పటికీ బ్రేక్లు వేసినప్పుడు మంటలు చెలరేగవచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.