న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై ఆ పార్టీ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందించారు. సంజయ్ సింగ్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్వేచ్ఛగా పాల్గొనవచ్చని సర్వోన్నత న్యాయస్ధానం ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ పేర్కొనడాన్ని ప్రియాంక స్వాగతించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇది కీలక పరిణామంగా చెబుతున్నారు. ఈరోజు దేవుడు తమవైపు ఉన్నాడని, భజరంగ్ బళి తమవైపు ఉన్నారని, సత్యం గెలిచిందని ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామని, ఈ కేసు మొత్తం బూటకమని, బీజేపీ కార్యాలయంలో ఈ కేసుపై కట్టుకథ అల్లారని ఆమె అన్నారు.
మరో 500 సార్లు దాడులు చేసినా ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేరని స్పష్టం చేశారు. విచారణలో డబ్బు పట్టుబడనప్పుడు ఆయనను ఎందుకు కస్టడీలో ఉంచాలని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిందని ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు.
Read More :
Health Tips | రోజూ వీలైనంత త్వరగా భోజనంచేస్తే ఆ వ్యాధుల ముప్పు తగ్గుతుందట!