AAP MP Sanjay Singh | ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్తోపాటు మరో ఐదుగురికి ఒక ప్రత్యేక న్యాయస్థానం మూడు నెలల జైలుశిక్ష, రూ.1500 జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్లో 2001లో తరుచుగా జరుగుతున్న విద్యుత్ కోతలకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 2001లోనే వీరిపై కేసు నమోదైంది.
ఈ కేసును విచారించిన ఎంపీ/ ఎంఎల్ఏల ప్రత్యేక కోర్టు మేజిస్ట్రేట్ యోగేశ్ యాదవ్ బుధవారం సంజయ్ సింగ్తోపాటు సమాజ్వాదీ పార్టీ మాజీ ఎమ్మెల్యే అనూప్ సందా, మాజీ కార్పొరేటర్ కమల్ శ్రీవాత్సవ మరో ముగ్గురికి జైలు శిక్ష విధించారు. వీరిపై పోలీసులు ఐపీసీలోని 143, 341 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.