న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో అరెస్టయి జైలులో ఉన్న కేజ్రీవాల్కు వైద్య చికిత్స నిరాకరణపై ఆప్ తీవ్ర ఆరోపణలు చేసింది. తీహార్ జైలులో ఉన్న కేజ్రీవాల్ను తన వైద్యుడిని సంప్రదించకుండా చేయడమే కాక, ఇన్సులిన్ను నిరాకరించడం ద్వారా ఆయనను నెమ్మదిగా మృత్యుముఖంలోకి నెడుతున్నారని విమర్శించింది.
ఆప్ అధికార ప్రతినిధి, మంత్రి సౌరభ్ భరద్వాజ్ శనివారం మాట్లాడుతూ.. జైలులో కేజ్రీవాల్ చక్కెర స్థాయిలు పరిశీలిస్తే ఆయనను నెమ్మదిగా చంపడానికి కుట్ర జరుగుతున్నదని అన్నారు. అరెస్ట్కు కొద్ది నెలల ముందుగానే కేజ్రీవాల్ ఇన్సులిన్ను మానేశారని జైలు అధికారులు తెలిపారు.