న్యూఢిల్లీ, జనవరి 3: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సత్తా చాటుతుందని, 53-57 అసెంబ్లీ స్థానాలు సాధిస్తుందని టైమ్స్ నౌ నవభారత్ సర్వే వెల్లడించింది. ఉత్తరాఖండ్, గోవా రాష్ర్టాల్లోనూ ఆప్ గతంలో కంటే మెరుగైన ప్రదర్శన చేస్తుందని తెలిపింది. అయితే ఈ రెండు రాష్ర్టాల్లో అధికారం మళ్లీ బీజేపీకే దక్కుతుందని పేర్కొన్నది. జాతీయ రాజకీయాల్లో తన ఉనికిని చాటుకోవాలన్న ఆప్ ప్రయత్నాలకు ఈ ఎన్నికల ఫలితాలు మంచి ప్రోత్సాహాన్నిస్తాయని అభిప్రాయపడింది. టైమ్స్ నౌ సర్వే ప్రకారం… పంజాబ్లో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గాను ఆప్ 53-57 స్థానాలు గెలుచుకొని అధికారానికి మూడు నాలుగు సీట్ల దూరంలో నిలుస్తుంది. 41-45 సీట్లతో కాంగ్రెస్ రెండో స్థానానికి పడిపోతుంది. బీజేపీకి మూడు కంటే ఎక్కువ సీట్లు రాకపోవచ్చు. 2017 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 20 సీట్లు గెలిచింది. కాగా, గోవాలో 40 సీట్లకు గాను బీజేపీ 18-22 సీట్లతో మళ్లీ అధికారం చేపడుతుంది. ఆప్కు 11 స్థానాల దాకా రావొచ్చు. ఇక్కడ ఆప్కు 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాలేదు. ఉత్తరాఖండ్లో 70 సీట్లకు గాను బీజేపీ 42-48 సీట్లతో అధికారంలోకి వస్తుంది. ఆప్కు ఇక్కడ గరిష్ఠంగా 7 సీట్లు రావొచ్చు. గతంలో పార్టీకి ఇక్కడ ఒక్క సీటు కూడా రాలేదు. ఈ అసెంబ్లీ ఎన్నికల కోసం విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ తృణమూల్కు 2 శాతం కంటే ఓట్లు పడకపోవచ్చని సర్వే పేర్కొన్నది.