న్యూఢిల్లీ, మార్చి 19: ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ నేత సంజయ్ సింగ్ రెండోసారి రాజ్యసభ సభ్యునిగా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ఆయనతో ప్రమాణం చేయించారు. తీహార్ జైలులో ఉన్న సంజయ్ సింగ్ను స్థానిక కోర్టు ఆదేశాల మేరకు భద్రతా ఏర్పాట్ల మధ్య తీసుకొచ్చారు. ప్రమాణ స్వీకారం అనంతరం తిరిగి జైలుకు తీసుకెళ్లాలని సంబంధిత జైలు సూపరింటెండెంట్ను న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సంజయ్ సింగ్ను ఈడీ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతను జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.