Seat Deal : రానున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో ఆప్-కాంగ్రెస్ మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైన క్రమంలో గుజరాత్, గోవా, హరియాణ రాష్ట్రాల్లోనూ పొత్తు దిశగా చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిసింది. ఇరు పార్టీల మధ్య పలు రాష్ట్రాల్లో పొత్తుపై మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
బీజేపీ మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రాకుండా నిలువరించేందుకు పొత్తులు తప్పనిసరని పార్టీ భావిస్తోందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. ఆప్ అధికారంలో ఉన్న ఢిల్లీలో ఇరు పార్టీల మధ్య పొత్తు ఇప్పటికే ఖరారైంది. ఢిల్లీలో పాలక ఆప్ నాలుగు స్ధానాల్లో కాంగ్రెస్ మూడు స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది.
ఇక మరో మూడు రాష్ట్రాల్లోనూ ఇరు పార్టీల మధ్య పొత్తు ఖరారైందని చెబుతున్నారు. ఇక గుజరాత్లో రెండు లోక్సభ స్ధానాల్లో, హరియాణలో ఒక స్ధానంలో ఆప్ పోటీ చేయనుంది. ఇక పంజాబ్లో ఇరు పార్టీల మధ్య ఎలాంటి పొత్తు ఉండదని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. పంజాబ్లో మొత్తం 13 స్ధానాల్లో ఆప్ బరిలో దిగుతుందని చెప్పారు.
Read More :