న్యూఢిల్లీ, ఆగస్టు 29: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి దోపిడీ శాఖగా మారిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని వెంటనే రద్దు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ మద్యం కేసులో తప్పించడానికి మద్యం వ్యాపారవేత్త అమన్దీప్ సింగ్ నుంచి రూ. ఐదు కోట్ల లంచం తీసుకున్న ఈడీ అధికారులపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడాన్ని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో ప్రస్తావించారు. ఈ కేసును గత ఏడాదిగా దర్యాప్తు చేస్తున్న ఈడీ తనకి సంబంధం లేకున్నా అందులో తన పేరును ఇరికించి, తర్వాత విరమించుకుందని, అయితే తాను చేసిన తప్పుకు అది ఇంతవరకు క్షమాపణ కూడా చెప్పలేదన్నారు. కేంద్రంలోని బీజేపీకి ఈడీ దోపిడీ శాఖగా మారిపోయిందని ఆయన ఆరోపించారు.