ముంబై : మహారాష్ట్రలో బీజేపీ-సేన-ఎన్సీపీ సర్కార్పై యువ సేన నేత ఆదిత్య ఠాక్రే (Aaditya Thackeray) తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో ప్రస్తుతం ఒక సీఎం, ఇద్దరు “సగం” డిప్యూటీ సీఎంలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ఏక్నాథ్ షిండే సారధ్యంలోని మహారాష్ట్ర సర్కార్పై ఆదిత్య ఠాక్రే విరుచుకుపడుతూ షిండే హయాంలో అవినీతి పెచ్చుమీరిందని ఆరోపించారు.
ప్రభుత్వం రాజకీయ ప్రకనలపై పెద్దమొత్తంలో ఖర్చు చేస్తూ పాలనను గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పలు ఆస్పత్రుల్లో రోగుల ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనలను ఆయన ప్రస్తావించారు. షిండే సర్కార్ పట్ల ప్రజలు విసిగిపోయారని, రాబోయే ఎన్నికల్లో తిరిగి ఎంవీఏ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రస్తుత ప్రభుత్వం అసమర్ధ సర్కార్ అని ఆరోపిస్తూ కర్నాటక 40 శాతం కమిషన్ సర్కార్ అయితే మహారాష్ట్ర 100 శాతం అవినీతి సర్కార్ అని విమర్శించారు. లిక్కర్ స్కాం కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్ట్ను ప్రస్తావిస్తూ బీజేపీ విపక్ష నేతలపై ఓవైపు దర్యాప్తు సంస్ధలను ప్రేరేపిస్తూ మరోవైపు తమ పార్టీ గూటికి చేరిన వారికి వాషింగ్ మెషీన్లా పరిశుద్ధులను చేస్తోందని కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. ఇతర పార్టీల నుంచి తమ పార్టీలో చేరిన వారిని ఆపై ముఖ్యమంత్రులుగా, డిప్యూటీ సీఎంలుగా చేస్తోందని దుయ్యబట్టారు.
Read More :
West Bengal | రిక్రూట్మెంట్ స్కాం.. బెంగాల్ మంత్రి ఇంటిపై ఈడీ దాడి