న్యూఢిల్లీ, మార్చి: ఆధార్ దస్ర్తాలను మూడు నెలల పాటు అంటే ఈ ఏడాది జూన్ 14 వరకు ఆన్లైన్లో ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే ఇది ఆధార్ పోర్టల్లో సొంతంగా చేసుకొనే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఆధార్ సేవా కేంద్రాల్లో మాత్రం ఈ సేవలకు రూ.50 వసూలు చేస్తారని వెల్లడించింది. ఆధార్ జారీ అయ్యి పదేండ్ల పూర్తయిన వారు ఆధార్ను అప్డేట్ చేసుకోవాలని యూఐడీఏఐ సూచించింది.