న్యూఢిల్లీ: ఆధార్ అప్డేట్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న పత్రాలు పంపాలని వాట్సాప్, ఈ మెయిల్ ద్వారా మెసేజ్లు వస్తున్నాయా? అలాంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) హెచ్చరిస్తున్నది.
ఐడెంటిటీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలను పంపాలంటూ తాము పౌరులకు ఎలాంటి మెసేజ్లు పంపబోమని స్పష్టం చేసింది. సైబర్ నేరగాళ్లు పంపే ఇలాంటి మెసేజ్ల ఉచ్చులో పడి మోసపోవద్దని హెచ్చరించింది. ఆధార్ కార్డు అప్డేట్ను ఆధీకృత ఆధార్ సెంటర్లో మాత్రమే చేయించుకోవాలని సూచించింది.