లక్నో, ఏప్రిల్ 17: బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లో శాంతి భద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయి. రెండు రోజుల క్రితం గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్ను పోలీసుల ముందే కాల్చిచంపిన ఘటన చోటుచేసుకోగా.. తాజాగా రాష్ట్రంలో మరో హత్య జరిగింది. జలౌన్ జిల్లాలోని ఏత్ పట్టణంలో సోమవారం పట్టపగలే 21 ఏండ్ల యువతిని తుపాకీతో కాల్చిచంపారు. బాధిత యువతి కాలేజీలో పరీక్ష రాసి తిరిగి వస్తున్న క్రమంలో బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ దారుణానికి ఒడిగట్టారు. అనంతరం దుండగులు స్థానిక పొలీస్ స్టేషన్కు 200 మీటర్ల సమీపం నుంచి పారిపోవడం గమనార్హం. అతీక్ అహ్మద్ హత్యపై సంబురాలు చేసుకొన్న గోదీ మీడియా, బీజేపీ.. యువతి హత్యపైనా ఇలాగే సంబురాలు చేసుకొంటాయా? అని విపక్షాలు ప్రశ్నించాయి.