అశోక్నగర్, నవంబర్ 26: పోలీసులమని బెదిరించిన ఇద్దరు వ్యక్తులు రైల్వేస్టేషన్లో ఒక మహిళపై సామూహిక లైంగిక దాడి జరిపిన సంఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది. శుక్రవారంరాత్రి అశోక్నగర్ జిల్లా, ముం గ్వాలీ రైల్వేస్టేషన్లో జైపూర్ వెళ్లేందుకు 30 ఏండ్ల మహిళ తన భర్తతో రైలు కో సం ఎదురు చూస్తున్నది. ఆ సమయం లో అక్కడకు సివిల్ దుస్తుల్లో వచ్చిన ఇద్దరు వ్యక్తులు తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. వారిలో ఒక వ్యక్తి ఆమె భర్తను కొట్టి పక్కకు తీసుకెళ్లగా రెండో వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేశా డు. తర్వాత రెండో వ్యక్తి కూడా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.