న్యూఢిల్లీ : ఒకే ఫ్లాట్లో ఉంటున్న ఇద్దరు మహిళల మధ్య చిన్న గొడవ.. ఒకరి ప్రాణాల్ని తీసింది. ఢిల్లీలో అరుణానగర్లో తన రూమ్మేట్ను సప్న (36) అనే మహిళ కత్తితో పొడిచి చంపింది. సప్న, రాణి (35) ఇద్దరూ ఒకే ఫ్లాట్లో కిరాయికి ఉంటున్నారు. సోమవారం నైట్ పార్టీలో ఇద్దరూ మద్యం సేవించారు.
ఫ్లాట్కు వచ్చిన తర్వాత ఇద్దరిమధ్య వాగ్వాదం చెలరేగింది. ఆగ్రహానికి లోనైన సప్న కత్తితో రాణి ఛాతిభాగంపై పొడిచింది. రాణి ఘటనాస్థలంలోనే చనిపోయింది. సప్నపై పోలీసులు కేసు నమోదుచేశారు.