పట్నా: సాధారణంగా పెండ్లిళ్లలో పిల్ల ఇంటి నుంచి పిలగాని ఇంటికి, పిలగాని ఇంటి నుంచి పిల్ల ఇంటికి ఇరుకుటుంబాల సభ్యులు, బంధుమిత్రులు వెళ్లాలంటే తప్పనిసరిగా రవాణా వాహనాలు అవసరం. స్తోమతను అనుసరించి కార్లు, లారీలు, బస్సులను ఇందుకు వినియోగిస్తుంటారు. ఈ మధ్య కాలంలో కొంతమంది ధనికులు హెలిక్యాప్టర్లను కూడా ఉపయోగిస్తున్నారు. కానీ, వీటన్నింటికి భిన్నంగా బీహార్కు చెందిన ఓ పెండ్లి జంట మాత్రం ఒక ఇంటి నుంచి మరో ఇంటికి పడవలో ప్రయాణించింది.
వివరాల్లోకి వెళ్తే.. బీహార్ రాష్ట్రం సమస్తిపూర్ జిల్లాలోని గోబరిస్థ గ్రామానికి చెందిన రెండు కుటుంబాల వారు పెండ్లి సంబంధం కుదుర్చుకున్నారు. పిల్ల, పిలగానిది ఒకే ఊరు కావడంతో రవాణా ఖర్చులు మిగిలిపోతాయని ఆ పేద కుటుంబాలు భావించాయి. కానీ, తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలచినట్లు.. తీరా పెండ్లికి ఒక రోజు ముందు భాగమతి నది ఉప్పొంగి ఆ గ్రామం అంతటా నడుముల లోతు నీళ్లు నిలిచాయి.
దీంతో చేసేదేమీ లేక రెండు కుటుంబాల వారు మూడు నాటు బోట్లు మాట్లాడి పెండ్లి తంతు పూర్తిచేశారు. పెండ్లి పిల్ల, పెండ్లి కొడుకుతోపాటు కుటుంబసభ్యులు, చుట్టపక్కాలు అంతా ఆ బోట్లలోనే ఓ ఇంటి నుంచి మరో ఇంటికి ప్రయాణించారు. పడవల్లో పెండ్లి పిల్ల, పెండ్లి కొడుకు ప్రయాణానికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. ఈ కింది వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
ఇవి కూడా చదవండి..
ఇంట్లో దూరి 21 పిల్లలు చేసిన నాగుపాము..!
ముక్కులో చెక్కపుల్లలు.. వారమైనా గుర్తించలేకపోయిన మహిళ..!
అద్భుతమైన స్టెప్పులతో అదరగొట్టిన వృద్ధుడు.. వైరల్ వీడియో
‘గిన్నిస్’కు ఎక్కిన గుర్రం బిగ్ జాక్ మృతి..!