న్యూఢిల్లీ: తాలిబన్ల ఆక్రమణతో అస్థిరత్వం నెలకొన్న ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇప్పటివరకు 626 మందిని భారత్కు తరలించామని కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పురి ( Hardeep Singh Puri ) తెలిపారు. భారత్కు తరలించిన మొత్తం 626 మందిలో 228 మంది భారత పౌరులు ఉన్నారని ఆయన చెప్పారు. ఆ తర్వాత అధిక సంఖ్యలో ఆఫ్ఘనిస్థాన్కు చెందిన సిక్కులు 77 మంది ఉన్నట్లు హర్దీప్సింగ్ పురి వెల్లడించారు.
ఇదిలావుంటే, ఆప్ఘనిస్థాన్ నుంచి బాధితులను భారత్కు తరలించే ప్రక్రియకు ఆపరేషన్ దేవి శక్తి అని నామకరణం చేసినట్లు ఈ ఉదయం భారత విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. మరోవైపు ఆఫ్ఘనిస్థాన్లో శాంతిని నెలకొల్పడం, అస్థిరతను తొలగించి స్థిరత్వానికి బీజం వేయడం తదితర అంశాలపై భారత ప్రధాని నరేంద్రమోదీ.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు. దాదాపు 45 నిమిషాలపాటు వారి ఫోన్ సంభాషణ కొనసాగింది.