మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనల్లో 24 మంది దుర్మరణం చెందగా, 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఖార్గోన్ జిల్లా నుంచి ఇండోర్కు 70 మందితో ఓ ప్రైవేటు బస్సు మంగళవారం బయలుదేరింది. డొంగర్గావ్ సమీపంలో బోరాడ్ నది వంతెన వద్దకు రాగానే బస్సు అదుపుతప్పింది.
నదిలో నీళ్లు లేకపోవడంతో భూమిని బస్సు బలంగా ఢీకొన్నది. 24 మంది ప్రయాణికులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి దవాఖానకు తరలించారు. మృతుల కుటుంబ సభ్యులకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.4 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాయి.