Clash : పశ్చిమబెంగాల్ (West Bengal) లోని ఉత్తర 24 పరగణాల జిల్లా (North 24 Paraganala district) లో బీజేపీ, టీఎంసీ కౌంటింగ్ ఏజెంట్లకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై పరస్పర దాడలకు దిగారు. ఇంతలో భద్రతా సిబ్బంది రంగంలోకి దిగి రెండు వర్గాల వారిని చెరోవైపునకు చెదరగొట్టారు. ఒక్కసారిగా రెండు పార్టీల కౌంటింగ్ ఏజెంట్లు పరస్పర దాడులకు దిగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. బరాక్పూర్లోని రాష్ట్రగురు సురేంద్రనాథ్ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అయితే రెండు వర్గాల మధ్య దాడులకు గల కారణాలు ఏమిటో తెలియరాలేదు. అయితే కౌంటింగ్ కేంద్రం రెండు పార్టీల వాళ్లు కొట్టుకున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | Barrackpore, North 24 Parganas: A scuffle broke out at Barrackpore Rastraguru Surendranath counting centre in West Bengal
Security personnel are present at the scene. More details are awaited. pic.twitter.com/h5a94Bpt3j
— ANI (@ANI) May 4, 2026