డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురుస్తోన్న భారీ వర్షాలకు వరద పోటెత్తింది. చంపావత్ జిల్లాలో తనక్పూర్లో వరద ఉధృతికి ఓ స్కూల్ బస్సు కొట్టుకుపోయింది. అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో విద్యార్థులు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ప్రమాదం నుంచి బస్సు డ్రైవర్, కండక్టర్ సురక్షితంగా బయటపడ్డారు. వరద ఉధృతిని గమనించినప్పటికీ, డ్రైవర్ బస్సును ముందుకు పోనివ్వడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
#BusAccident
Shocking accident on #Poornagiri Road in #Champawat district of #Uttarakhand when a bus washed away in Floods.
Thankfully no children were in this bus at time. pic.twitter.com/qHTGKFYk4C— Jasmeen Kaur (@Jasmeen66480371) July 19, 2022