Tamil Nadu | చెన్నై : తమిళనాడులోని కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునేల్వేలి, టెన్కాశీ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తోన్న సంగతి తెలిసిందే. ఆ జిల్లాల్లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ సహాయక చర్యలు చేపట్టింది. వరదలో చిక్కుకున్న ఓ గర్భిణి, చిన్నారిని ఆర్మీ హెలికాప్టర్లో మధురైకి తరలించారు. బేబి వయసు ఒకటిన్నర ఏండ్లు అని ఆర్మీ అధికారులు తెలిపారు. మరో నలుగురు ప్రయాణికులను కూడా రక్షించినట్లు చెప్పారు.
తమిళనాడులో కురుస్తోన్న భారీ వర్షాలకు ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, పలువురు నిరాశ్రయులైన సంగతి తెలిసిందే. ఈ నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఈ నాలుగు జిల్లాలకు అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఆర్మీ, ఇతర విపత్తు బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు ముమ్మరం చేశారు. నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. నిరాశ్రయులకు పాలు, బిస్కెట్లు, బ్రెడ్ ప్యాకెట్లు, ఇతర నిత్యవసరాలను అందజేస్తున్నారు.
#WATCH | Indian Air Force helicopters are deployed for HADR (Humanitarian Assistance and Disaster Relief) missions in Tamil Nadu due to unprecedented rains in the last 24 hours. Four passengers including a pregnant woman & baby aged 1.5 yrs were winched up and taken safely to… pic.twitter.com/zSXB1kF8Ue
— ANI (@ANI) December 19, 2023