లఖింపూర్ ఖేరీ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు. ఓ కేంద్ర మంత్రి రైతులను చంపేశారని, ఈ విషయం ప్రధాని మోదీకి కూడా బాగా తెలుసని వ్యాఖ్యానించారు. దేశంలోని ఓ ముగ్గురు పెట్టుబడిదారులు రైతులకు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన ఆరోపించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి పార్లమెంట్ను ఎలా నడపాలో తెలియడం లేదని మండిపడ్డారు.
ఓ బిల్లు వెనుక ఓ బిల్లు పాస్ అవుతూనే ఉందని, పార్లమెంట్ను నడిపే పద్ధతి ఇది కానేకాదన్నారు. ప్రధాని మోదీ పార్లమెంట్కు రావడం లేదని, దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తే అవకాశమే లేకుండా పోతోందని రాహుల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇలా చేస్తూ ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. 12 మంది ఎంపీలను సస్పెండ్ చేయడం అంటే ప్రజల గొంతు నొక్కడమేనని, వారు ఏ తప్పూ చేయలేదని, అయినా కేంద్రం వారి గొంతును నొక్కేస్తోందని రాహుల్ తీవ్రంగా మండిపడ్డారు.