Robbery | చండీగఢ్: పంజాబ్లోని లుధియానాలో బ్యాంకులకు, ఏటీఎంలకు నగదును సరఫరా చేసే కంపెనీ సీఎంఎస్లో శుక్రవారం రాత్రి భారీ దోపిడీ జరిగింది. ఆయుధాలతో వచ్చిన 10 మంది ముసుగు దొంగలు సిబ్బందిని తుపాకులతో బెదిరించి రూ.7 కోట్లను దోచుకున్నారు. కార్యాలయంలోని నాలుగు కోట్లతో పాటు, నగదును ఉంచిన మూడు కోట్ల రూపాయల వ్యాన్తో పరారయ్యారు.
తెలిసిన వారే ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం సమాచారం అందినట్టు పోలీస్ కమిషనర్ మన్దీప్ చెప్పారు. వ్యాన్ను మల్లాన్పూర్లో గుర్తించారు. అందులో రెండు ఆయధాలు లభ్యమయ్యాయి. రూ.10 కోట్ల దోపిడీ జరిగి ఉండవచ్చని కమిషనర్ తెలిపారు.