రాయ్పూర్ : బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనాస్థలిలో ఆయుధాలు, పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టుల కదలికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ఏరియాలో మావోయిస్టుల కోసం పోలీసులు కూంబింగ్ కొనసాగిస్తున్నారు.