హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(MLA Kasireddy Narayana Reddy) కారును ఢీ కొని(Road accident) పబ్బతి నరేష్( 25 )(Man died) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. నాగర్కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మల్లు రవికి మద్దతుగా తలకొండపల్లి మండలం వెల్జాల్లో ప్రచారం ముగించుకొని వెళ్తుండగా ఎమ్మెల్యే కారును ఓ బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించగా బైరవపాక పరుశరాములుకు తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రుడిని కల్వకుర్తిలోని హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.