ఖుషీనగర్: ఎయిర్ ఇండియాకు సంబంధించిన కీలక అడుగును వేశామని ప్రధాని మోదీ అన్నారు. ఇవాళ యూపీలోని ఖుషీనగర్లో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. దివాళా దశలో ఉన్న ఎయిర్ ఇండియాను పునరుద్దరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ప్రొఫెషనల్గా నడిపించేందుకు, సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని, భద్రత కల్పించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భారతీయ విమానయాన రంగానికి కొత్త ఎనర్జీ వస్తుందని ప్రధాని అన్నారు. ఎయిర్ ఇండియాను 18వేల కోట్లకు టాటా సన్స్ సంస్థ బిడ్డింగ్లో దక్కించుకున్న విషయం తెలిసిందే.