బెంగళూరు : కర్ణాటకలోని మైసూరులో ఓ చిరుత పులి బీభత్సం సృష్టించింది. కనకా నగర్లోకి ప్రవేశించిన చిరుత నడిరోడ్డుపై హల్ చల్ చేసింది. జనాలపై దాడి చేసి పలువురిని తీవ్రంగా గాయపరిచింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. తమ నివాసాల నుంచి బయటకు వచ్చేందుకు జనాలు భయపడ్డారు. స్థానికులు అందించిన సమాచారంతో కనకా నగర్కు అటవీ శాఖ అధికారులు, పోలీసులు చేరుకున్నారు. అనంతరం చిరుత పులిని అధికారులు బంధించారు. ఆ తర్వాత ప్రత్యేక వాహనంలో చిరుతను తరలించి, అడవిలో వదిలేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
#WATCH | Karnataka: A leopard entered the Kanaka Nagar of Mysuru & attacked some people, he was later captured & rescued by the forest department pic.twitter.com/yVBIcfOyxM
— ANI (@ANI) November 4, 2022