న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ముగ్గురు దొంగలు తలలకు హెల్మెట్లు పెట్టుకుని జ్యుయెలరీ షాపులో చొరబడ్డారు. పిస్టల్లు పట్టుకుని లోపలికి వచ్చిన దొంగలు కదిలితే కాల్చిపారేస్తామని కస్టమర్లను, సేల్స్ పర్సన్స్ను బెదిరించారు. క్యాష్ కౌంటర్లో ఉన్న నగదును వెంట తెచ్చుకున్న బ్యాగులో సర్దుకుని అక్కడి పారిపోయే ప్రయత్నం చేశారు.
అయితే, పారిపోయే క్రమంలో జ్యుయెలరీ షాపు సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించి ఒక దొంగను పట్టుకున్నారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి ఒక పిస్టల్ను, నాలుగు లైవ్ బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నారు. పారిపోయిన మరో ఇద్దరు దొంగల కోసం గాలిస్తున్నారు.
ఈశాన్య ఢిల్లీలోని కరవాల్ నగర్ ఏరియాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దొంగలు జ్యుయెలరీ షాపును దోచుకున్న దృశ్యాలను కింది వీడియోలో మీరు కూడా చూడవచ్చు..
#WATCH | A jewellery shop was robbed by three men in Karawal Nagar area of Delhi’s North East district at gunpoint on 31st October. One robber was apprehended; one pistol and 4 live rounds were recovered from him.
(Video source: CCTV footage confirmed by police) pic.twitter.com/36KYhIBuRO
— ANI (@ANI) November 1, 2023