IT Fraud | కాన్పూర్, జూన్ 16: బీజేపీ అధికారంలో ఉన్న యూపీలోని కాన్పూర్లో భారీ ఇన్కంట్యాక్స్ కుంభకోణం వెలుగు చూసింది. రిక్షా కార్మికులు, చెత్త ఏరుకునే వారు, పాతసామాన్లు అమ్మేవారి పేరుపై కోట్లాది రూపాయల విలువైన లావాదేవీలు నిర్వహించి వందల కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారు.
ఓ వ్యక్తి అల్పాదాయ వర్గాలకు చెందిన చెత్త ఏరుకునే వారు, పాత సామాన్లు అమ్మేవారిని మంచి చేసుకుని నెలకు 10 వేల రూపాయలు ఇస్తానంటూ మభ్యపెట్టి వారి పేరుతో పలు సంస్థలను ఏర్పాటు చేశాడు. వారి బ్యాంక్ ఖాతాలను మనీ లాండరింగ్కు వినియోగించి రూ.80 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డాడు.