బాలాసోర్: ఒడిశా రైళ్ల ప్రమాదంలో మృతదేహాలు భద్రపరిచేందుకు తాత్కాలిక శవాగారంగా వినియోగించిన బాలాసోర్ జిల్లాలోని బాహానగా హైస్కూల్ను కూల్చివేశారు. ఈ ఘటనలో మృతదేహాలను స్థానిక బాహానగా హైస్కూల్లో భద్రపరిచారు. దీంతో స్థానికులు అటు వైపు పోవడానికి కూడా జంకుతున్నారు.
సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో పాఠశాలకు వచ్చేందుకు విద్యార్థులు భయపడుతున్నారు. తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాలకు పిల్లలను పంపించేందుకు వెనకడుగు వేస్తున్నారు. దీంతో స్కూల్ ప్రిన్సిపాల్ ప్రమీలా స్వయిన్ ఈ విషయాన్ని బాలాసోర్ జిల్లా కలెక్టర్ దత్తాత్రేయ షిండేకు చెప్పగా ఆయన పాఠశాల కూల్చివేతకు ఆదేశించారు.