న్యూఢిల్లీ, డిసెంబర్ 3: మూడు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారు. తన ప్రభుత్వ అజెండా అయిన ఆత్మ నిర్భర భారత్ సాధించిన విజయంగా ఎన్నికల ఫలితాలను అభివర్ణించారు. ఈ హ్యాట్రిక్ గెలుపు 2024లో జరిగే లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ గెలుపుకు హామీ ఇస్తునట్టు తెలిపారు. ఆదివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణులు, కేంద్ర మంత్రులను ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్, విపక్ష ఇండియా కూటమికి తాము గుణపాఠం నేర్పించామన్నారు. ఇండియా కూటమి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోలేదన్నారు.