పాలక్కాడ్ (కేరళ), జూలై 12: ఒక అడవి పంది మహిళా ఆటోడ్రైవర్ ప్రాణాలను తీసింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లా మంగళం డ్యామ్ ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. 37 ఏండ్ల విజీష సోనియా తన ఆటోలో నలుగురు స్కూల్ పిల్లలతో ఉదయం 8 గంటలకు ఒడంతోడు-మంగళం డ్యామ్ రోడ్లో వెళ్తుండగా హఠాత్తుగా వచ్చిన అడవి పంది వీరి వాహనాన్ని వేగంగా ఢీకొంది.
దీంతో ఆటో బోల్తాపడి విజీష తీవ్రంగా గాయపడింది. ఆమెను ఒక ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మరణించింది. ఈ ప్రమాదంలో ఆటోలోని స్కూల్ పిల్లలకు స్వల్పంగా గాయాలయ్యాయి.