భోపాల్, ఆగస్టు 15: జాతీయ పతాకం సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవం నాడు బీజేపీ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఒక దళిత సర్పంచ్కు ఘోర అవమానం జరిగింది. దళితుడన్న కారణంతో అగ్రకుల అహంకారం అతడిని జెండా ఆవిష్కరణ చేయకుండా అడ్డుకుంది. కనీసం జెండాను ముట్టుకోవడానికి కూడా అంగీకరించ లేదు. దాతియా జిల్లాలోని ఒక గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో మంగళవారం జరిగిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెండా ఆవిష్కరణకు వచ్చిన బరేలాల్ అల్వాల్ అనే దళిత సర్పంచ్ను అక్కడ ఉన్న అగ్రకులాని చెందిన ఒక ఉపాధ్యాయుడు అడ్డుకున్నాడు. ‘నీవు దళితుడివి కదా జెండాను ఆవిష్కరించే హక్కు నీకెక్కడిది?’ అని ప్రశ్నించి అవమానించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది.