పట్నా: ఎన్నికలంటే పరస్పర దూషణలకు మాత్రమే కాదు, పరస్పర దాడులకు కూడా పర్యాయపదంగా మారిపోయాయి. ఎన్నిక చిన్నదైనా పెద్దదైనా అభ్యర్థుల మధ్య, వారి మద్దతుదారుల మధ్య ఘర్షణలు సర్వసాధారణం అయ్యాయి. తాజాగా బీహార్ రాష్ట్రం, నలందా జిల్లాలోని పటేల్నగర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో అలాంటి ఘర్షణలే జరిగాయి.
రెండు పార్టీలకు చెందిన అభ్యర్థుల మద్దతుదారులు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. కర్రలతో కొట్టుకున్నారు. రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణల్లో రెండు వైపుల పలువురికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. ప్రస్తుతం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నదని పోలీసులు చెప్పారు.
#WATCH | Bihar: A clash broke out between the supporters of two candidates of local body polls in Patel Nagar area in Nalanda district. Police on the spot. pic.twitter.com/uDYNCay7Qf
— ANI (@ANI) December 28, 2022