సమోసాకు ప్రాచుర్యం తీసుకు రావడానికి యూపీలోని మీరఠ్లో శుభం కౌశల్ అనే వ్యాపారి వినూత్న ప్రయత్నం చేశారు.
12 కిలోల భారీ సైజు సమోసాను తయారు చేసి, దాన్ని అర గంటలో తిన్నవారికి రూ.71 వేల నగదు బహుమతి ఇస్తానని ప్రకటించారు. సమోసా ఖరీదు రూ.1500 వరకు ఉంటుందని వెల్లడించారు.