Maharashtra | ముంబై, అక్టోబర్ 2: మహారాష్ట్రలోని వసీం జిల్లాలో ఓ బర్రె మంగళసూత్రాన్ని మింగింది. జిల్లాకు చెందిన రైతు రామ్హరి భార్య స్నానం చేసేందుకు వెళుతూ.. దాణా ఉన్న గిన్నెలో రూ. లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని దాచిపెట్టింది.
ఆ విషయాన్ని మరిచిపోయిన ఆమె దాణా గిన్నెను బర్రె వద్ద ఉంచింది. మంగళసూత్రాన్ని దాణాతో పాటు బర్రె మింగేసింది. అనంతరం ఆమె పొరపాటును గ్రహించింది. పశువైద్యుడికి సమాచారమి వ్వగా ఆయన శస్త్రచికిత్స చేసి మంగళ సూత్రాన్ని బయటకు తీశారు.