శ్రీనగర్, అక్టోబర్ 10: జమ్ముకశ్మీర్లోని మైనారిటీ పౌరులపై ఇటీవల ఉగ్రవాదుల దాడులు పెరిగిపోవడంతో అక్కడి పోలీసులు అప్రమత్తమయ్యారు. లష్కరే తాయిబా, జైషేమహమ్మద్, ఆల్ బదర్, ది రెసిస్టెంట్ ఫ్రంట్ వంటి ఉగ్రవాద సంస్థలకు సహకరిస్తున్నట్టు అనుమానిస్తున్న 900 మందిని పోలీసులు ఆదివారం నిర్బంధించారు. వీరిని పలు దర్యాప్తు సంస్థలకు చెందిన అధికారులు విచారిస్తున్నట్టు సమాచారం.