శిమ్లా: హిమాచల్ప్రదేశ్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతో రెండు రోజుల వ్యవధిలో 9 మంది మరణించగా, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారు. వరదల వల్ల రాష్ట్రంలో 142 రోడ్లు కొట్టుకుపోయాయని రెవెన్యూశాఖ వెల్లడించింది. వర్షాల కారణంగా కులూ జిల్లాలో వాతావరణ శాఖ పసుపు రంగు హెచ్చరిక జారీచేసింది. జిల్లాలోనే 25 రోడ్లు పూర్తిగా ధ్వసమయ్యాయని అదనపు డిప్యూటీ కమిషనర్ ప్రకాశ్ సింగ్ తెలిపారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టడానికి ఎన్డీఆర్ఎఫ్ దళాలను కేంద్ర ప్రభుత్వం పంపించింది. పరిస్థితిని కేంద్ర హోంశాఖ ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నదని వెల్లడించింది.
కాగా, హిమాచల్ ప్రదేశ్లో వరదలపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని అన్నారు. అధికారులు నిరంతరం రాష్ట్రప్రభుత్వంతో సంప్రదింతులు జరుపుతున్నారని వెల్లడించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నానని ప్రధాని అన్నారు.