డెహ్రాడూన్: 85 మంది స్కూల్ విద్యార్థులు, 11 మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో ఆ స్కూల్ను మైక్రో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. గంగార్కోట్లోని జవహర్ నవోదయ విద్యాలయంలో తొలుత 11 మంది విద్యార్థులు, కొందరు సిబ్బందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో శనివారం మిగతా విద్యార్థులకు కరోనా టెస్ట్ చేశారు. విద్యార్థులు, స్కూల్ సిబ్బంది కలిపి మొత్తం 496 నమూనాలు సేకరించి పరీక్షించారు. 85 మంది విద్యార్థులు, 11 మంది స్కూల్ సిబ్బందికి పాజిటివ్గా రిపోర్ట్ వచ్చింది. కరోనా సోకిన వారిని స్కూల్లోనే ఐసొలేషన్లో ఉంచారు.
ఈ పరిణామం నేపథ్యంలో డిప్యూటీ కలెక్టర్ రాహుల్ షా ఆదేశాల మేరకు ఆ స్కూల్ను మైక్రో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాఖండ్లో శనివారం కొత్తగా మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో కొత్త వేరియంట్ కేసుల సంఖ్య 8కి చేరింది.