న్యూఢిల్లీ, జూలై 16: దేశంలో ప్రస్తుతం 6.10 లక్షల మంది జైళ్లలో మగ్గుతున్నారని, వారిలో 80 శాతం మంది ఖైదీలు అండర్ ట్రయల్సేనని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆందోళన వ్యక్తం చేశారు. జైపూర్లో 18వ ఆలిండియా లీగల్ సర్వీసెస్ అథారిటీ సదస్సు ప్రారంభోత్సంలో పాల్గొన్న ఆయన.. క్రిమినల్ న్యాయ వ్యవస్థలోని విచారణ ప్రక్రియే ఒక శిక్షగా మారిందని వెల్లడించారు. విచక్షణారహితంగా అరెస్టులు చేయడం దగ్గరి నుంచి బెయిల్ పొందడం వరకు శిక్షలాగే ఉందని పేర్కొన్నారు. కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ఒక సంపూర్ణ ప్రణాళిక అవసరమని అభిప్రాయపడ్డారు. ఒకప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండేదని, ఇప్పుడు ప్రతిపక్షంపై పగ పెరుగుతున్నదని .ఇది ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికి మంచిది కాదని