న్యూఢిల్లీ: డిజిటిల్ బ్యాంకింగ్ సదుపాయాలు ప్రతి ఒక్కరికీ అందాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నది. 75 ఏళ్ల స్వాతంత్య్ర సంబరాలను పురస్కరించుకుని, దేశంలోని 75 జిల్లాల్లో 75 డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ బ్యాంక్లను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. ఆన్లైన్ పేమెంట్స్ను ఈ బ్యాంక్ల ద్వారా ప్రమోట్ చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రైతులకు కూడా ఈ బ్యాంక్ల ద్వారా ఉపయోగం జరుగుతుందని ఆమె అన్నారు. రాష్ట్రాల సహకారంతో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగుతుందన్నారు. దేశంలోని 1.5 లక్షల పోస్టాఫీసులు డిజిటల్ బ్యాంకింగ్ కిందకు రానున్నట్లు ఆమె చెప్పారు.