జైపూర్ : ఈ సీజన్కు సంబంధించి.. గత 74 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా రాజస్థాన్ జైసల్మేర్లో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తాజాగా వెల్లడించింది. సెప్టెంబర్ 10, 1949లో జైసల్మేర్లో గరిష్ట ఉష్ణోగ్రత 43.3 డిగ్రీల సెల్సియస్ కాగా, 74 ఏండ్ల తర్వాత మళ్లీ ఆల్ టైం గరిష్టం 43.5 డిగ్రీల సెల్సియస్ నమోదైందని ఐఎండీ పేర్కొన్నది.
ఇది ఈ సీజన్ సగటు ఉష్ణోగ్రలతో పోల్చుకుంటే 6.9 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉందని తెలిపింది. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన రెండో ప్రాంతంగా బార్మర్ నిలిచింది. శనివారం ఇక్కడ 40.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో బికనీర్, జోధ్పూర్, జాలోర్, గాంధీనగర్ నిలిచాయి.