న్యూఢిల్లీ: జాతీయపార్టీలు 2019-20 సంవత్సరంలో గుర్తుతెలియని వర్గాల నుంచి రూ.3,377.41 కోట్లు విరాళాలుగా స్వీకరించాయని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రైట్స్ (ఏడీఆర్) తెలిపింది. ఆయా పార్టీల మొత్తం ఆదాయంలో అది 70.98 శాతం వరకు ఉంటుందని పేర్కొన్నది. అందులో పాలక బీజేపీ గరిష్ఠంగా రూ.2,642.63 కోట్లు ఇలా అజ్ఞాత నిధుల రూపంలో వసూలు చేసిందని ఏడీఆర్ తాజా నివేదికలో వివరించింది.