జమ్ము: జమ్ముకశ్మీర్ రాష్ట్రం కిష్ఠ్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న టాటా సుమో అదుపు తప్పి భారీ లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో సుమోలోని ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో నలుగురిని పోలీసులు స్థానికుల సాయంతో వెలికితీసి, చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు.
మృతదేహాలకు వెలికి తీసి పోస్టుమార్టానికి పంపించారు. కిష్ఠ్వార్ జిల్లాలోని ఛట్రూ ఏరియాలో ఈ ప్రమాదం జరిగింది. లోయ చాలా లోతుగా ఉండటంతో వాహనం పల్టీలు కొట్టుకుంటూ పడిపోయిందని, అందుకే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని ప్రత్యక్షసాక్ష్యులు చెబుతున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.