ముంబై ,మే 3: కరోనా కారణంగా దేశంలో బంగారం ధరలు పెరుగుతూ , తగ్గుతూ వస్తున్నాయి. భవిష్యత్ లోను గోల్డ్ రేట్లు పెరుగుతాయా..? అంటే అవునని అంటున్నారు ఆర్ధిక విశ్లేషకులు. గత కొన్ని రోజులుగా దిగొస్తున్న బంగారం ధరలలో మార్పులు చోటుచేసుకుంటాయని వారు చెబుతున్నారు. రానున్న రోజుల్లో గోల్డ్ రేట్స్ భారీగా పెరిగే అవకాశాలున్నాయని వెల్లడిస్తున్నారు. అయితే ఏప్రిల్ నెలలో 10 గ్రాముల బంగారం ధరపై రూ.2,602 వరకు పెరిగింది. మార్చి 31న 10 గ్రాముల బంగారం ధర రూ.44,190 ఉంది. అయితే మే నెలకు సంబంధించి గోల్డ్ ధరల్లో భారీ మార్పులు కనిపించే అవకాశాలున్నాయంటున్నారు.