అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్సిటీ సమీంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్లో లిఫ్ట్ కూలిపోయింది. దీంతో ఏడుగురు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని దవాఖానకు తరలించారు. ప్రమాద సమయంలో లిఫ్ట్లో ఎనిమిది మంది ఉన్నారని తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.