ముంబై : ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) కార్యాలయంలో పనిచేస్తున్న 68 మంది సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) ఉద్యోగులకు కరోనా సోకిందని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు. కార్యాలయంలో పని చేస్తున్న 235 మందికి పరీక్షలు నిర్వహించాలని సీబీఐ బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ను కోరింది. ఈ మేరకు సిబ్బంది, అధికారులకు పరీక్షలు నిర్వహించగా.. ఇందులో 68 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది.
వైరస్ పాజిటివ్గా తేలిన ఉద్యోగులు హోంక్వారంటైన్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్రలో కరోనా విలయం సృష్టిస్తున్నది. ఇటీవల రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ముంబై మహానగరంలో వైరస్ తీవ్రత పెరుగుతుండడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని సర్కారు పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే.