భువనేశ్వర్: ఒడిశాలోని రాయగడ (Rayagada) జిల్లాలో కరోనా కలకలం సృష్టిస్తున్నది. జిల్లాలోని రెండు ప్రభుత్వ ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న 64 మంది విద్యార్థులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు వారిని హోం ఐసోలేషన్ చేశారు. మిగిలిన విద్యార్థులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కరోనా సోకిన విద్యార్థుల్లో ఎలాంటి లక్షణాలు లేవని తెలిపారు.
కోట్లగూడలోని అన్వేష హాస్టల్లో మొత్తం 257 మంది విద్యార్థులకు ఈ నెల 4న ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు. వారిలో 44 మందికి పాజిటివ్ అని తేలింది. అదేవిధంగా బీస్మమ్ కటక్ బ్లాక్లోని హాస్టల్లో మరో 20 మంది విద్యార్థులకు కరోనా సోకింది. వీరంతా ఎనిమిదో తరగతి చదువుతున్నారని జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ అశోక్ కుమార్ చెప్పారు.